Breaking News

అందరికీ అందుబాటులోకి సంగం డైరీ ఉత్పత్తులు: చైర్మన్ దూళిపాళ్ళ

విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి : మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అసవరమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నామని సంఘం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ఉస్మానియా సాల్టెడ్‌ బిస్కట్లు, ఫ్లమ్‌ కేక్‌, ఎగ్‌లెస్‌ కేక్‌,  హాయ్‌ అరోమా నెయ్యి 30, 50 గ్రాముల ప్యాకింగ్‌, 5 లీటర్ల ఆవునెయ్యి, గేదె నెయ్యి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… పాడి రైతుల కోసం సంఘం డెయిరీ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గడ్డికోసే యంత్రాలకు పూజచేసి ప్రారంభించి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *