Breaking News

ఇబ్రహీంపట్నం సి ఐ శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల స్లాగ్ మార్చ్

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : కేతనకొండ, మూలపాడు, గుంటుపల్లి గ్రామాలలో స్లాగ్ మార్చ్ పర్యటన.ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, అందరూ సహకరించాలని కోరిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ కుమార్.విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ ఆదేశానుసారం సమస్యగా మారిన గ్రామాల్లో భాగంగా ములపాడు, కేతనకొండ, గుంటుపల్లి స్లాగ్ మార్చ్ నిర్వహించాలని కమిషనర్ తెలిపారు.ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో అందరూ కలిసి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని, ఏవిధమైన గొడవలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ కుమార్, యస్. ఐ. రమేష్, శ్రీనివాస్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *