Breaking News

ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి కొడాలి నాని

తెలుగు తేజం, గుడివాడ : వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను చూసి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడం లేదని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు దోచుకున్నారని, కేంద్రం నుంచి వచ్చిన సబ్సీడీ డబ్బు కూడా దోచేశారని మండిపడ్డారు. ఆదివారం ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు.సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు 2024 లోపు ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చి తీరుతామని కొడాలి నాని తెలిపారు. గుడివాడలో 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు కెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *