Breaking News

ఇసుక అక్రమ రవాణా ఫై కంచికచర్ల పోలీసులు దాడులు

తెలుగు తేజం, కంచికచర్ల : కృష్ణా జిల్, కంచికచర్ల మండలం, మోగులూరు గ్రామంలో కృష్ణా నది నుండి అనుమతులు లేకుండా అక్రమంగా విజయవాడ తరలిస్తున్న 9 ఇసుక టిప్పర్ లను పట్టుకున్న నందిగామ రూరల్ సీఐ సతీష్. గత కొద్ది రోజుగా పోలీసుల కళ్లుగప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఎవరికి అనుమానం రాకుండా కొన్ని లారీలకు బిల్లు తీసుకొని వాటి మధ్యలో నుండి బిల్లులలేని ఇసుక టిప్పర్ లను తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో 9 ఇసుక టిప్పర్ లకు అనుమతి లేకుండా రవాణా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించి కంచికచర్ల మార్కెటింగ్ యాడ్ కి తరలించి ఒక జెసిబి ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *