Breaking News

కంచికచర్ల శివారులో వరుస యాక్సిడెంట్లు

తెలుగు తేజం, కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్ల శివారు పేరకలపాడు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై విజయవాడ వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా వెళ్లి కారు సడన్ బ్రేక్ వేయడంతో తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్క పంట కాలంలో దూసుకు పోయింది. ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ ఎడమ చెయ్యి మరి ఒక వ్యక్తికి ఎడమ కాలు ఫ్యాక్చర్ ఆయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ యంత్రాంగం మరియు హైవే మొబైల్ ఆంబులెన్స్ లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ యాక్సిడెంట్లో గాయపడిన నీలం నరసింహారావు సీఎం హోమ్ వద్ద RSI గా విధులు నిర్వహించి మధిర స్వగ్రామానికి వెళ్తున్న మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది అని పోలీసులు గుర్తించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *