Breaking News

క్యాపొ సొసైటీ దయ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలుగు తేజం, కొండపల్లి : దేశ భక్తినీ నర నరాల్లో ఎక్కించుకున్న యువత కు వసంత శక్తి వెన్ను దన్నుగా నిలిచింది. 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కొండపల్లి క్యాపో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై యువత లో నూతనోత్సాహం నింపారు. కొండపల్లి స్టేషన్ సెంటర్ నుండి ప్రారంభమైన మువ్వన్నెల జెండా ర్యాలీ ఆద్యంతం దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. భారత్ మాతా కీ జై అంటూ యువత చాటిన దేశ భక్తి కి ఎమ్మెల్యే వసంత మద్దతుగా ర్యాలీ లో పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారు. సినిమాలు, షికార్లు అంటూ కాలయాపన చేసే యువత ఉన్న ఈ రోజుల్లో కొండపల్లి యువత దేశ భక్తి తో మెలగడం అభినందనీయం అని ఎమ్మెల్యే వసంత కొనియాడారు. ఇదే తరహాలో యువత మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రతిష్టను నలుదిశలా చాటాలని పిలుపునిచ్చారు. యువత ఇంత ఆదర్శం ఆలోచన చేయడం శుభపరిణామం అని యువత ఉజ్వల భవిష్యత్తు కు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన క్యాపో సొసైటీ అధ్యక్షులు మొగిలి దయాసాగర్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన రక్త దాన శిబిరంలో యువత రక్త దానం చేసి ఇతరులకు ఆదర్శం గా నిలిచారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *