Breaking News

గుడివాడ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తా : మంత్రి కొడాలి నాని

గుడ్ మెన్ పేటలో రూ. 3.5 కోట్లతో నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం
అమృత పథకం కింద రూ.20 కోట్లతో ఇంటింటికి తాగునీటి సౌకర్యం
డిశంబరు 25న రాష్ట్రంలో 30 లక్షల మంది అర్హులైన లబ్దిదారులకు ఇంటి స్థల పట్టాలను అందిస్తాం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

తెలుగు తేజం, గుడివాడ : గుడివాడ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. స్థానిక గుడ్ మెన్ పేటలో రూ.3.5 కోట్లతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ కు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడ్ మెన్ పేట ప్రాంతంలో ఉన్న ట్యాంక్ శిధిలావస్థలో ఉన్నందున స్థానిక ప్రజలు మంచినీటి కొరకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో రూ. 3.5 కోట్లలో అదే స్థలంలో నూతన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు. అప్పటి వరకు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు నుండి ఈ ప్రాంత ప్రజలకు తాగునీని అందించాలని మున్సిపల్ కమీషనరుకు ఆదేశించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత పథకం కింద రూ.20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, పరిపాలన అనుమతులు లబించినందున పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. గుడివాడ నియోజవర్గంలో అభివృద్ది సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయల కల్పనకు అడిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజురు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25 వ తేదీన 30 లక్షల మంది అర్హులైన అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థల పట్టాలను అందజేయడం జరగుతుందన్నారు. ఇందులో భాగంగా గుడివాడ పట్టణంలో 8912 టిడ్కో గృహాలకు 3200 ఇల్లకు అసంపూర్తి గా పనులు మిగిలాయని, గత ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదని అన్నారు. ఈ మొత్తం ఇల్లకు మరల టెండర్లు పిలచి పనులు ప్రారంబించామన్నారు. అదేవిధంగా రూ.81 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ల ప్రక్రిను ప్రారంభించామని మంత్రి కొడాలి నాని అన్నారు. రానున్న మే మాసానికి 5 వేల ఇళ్లను, మరో నాలుగైదు మాసాల్లో 4 వేల ఇళ్ళను లబ్దిదారులకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 300 చ.గ. ఇంటికి 500 రూపాయలతో పాటు 2లక్షల65 వేల లోన్ ఇచ్చారని, నేడు మా ప్రభుత్వం వారి నుండి ఒక్కరూపాయి తీసుకొని పూర్తిగా లోన్ రద్దుచేసిన ఇంటిని అందిస్తామన్నారు. 430 చ.గ.ఇంటికి లక్ష రూపాయలకు బదులు 50 వేలు, 360 చ.గ. 50 వేలకు బదులు 25 వేల రూపాయలు కడితే సరిపోతుందని మిగిలిన సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీని వల 4,80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ పట్టణంలో 7700 మందికి ఇంటి స్థల పట్టాలను అందించేందుకు రూ. 94 కోట్ల రూపాయలతో 181 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అర్హులైన అందిరికీ ఇంటి స్థల పట్టాలను అందిస్తామన్నారు. గుడివాడ పట్టణంలో టిడ్కో ఇళ్లు, ఇంటి స్థల పట్టాల మొత్తం 17 వేలమంది లబ్దిదారుకు అందించడం జరుగుతుందన్నారు. డిశంబరు 25 నుండి ఇంటి స్థల పట్టాలను అందించి సెంటు స్థలంలో ప్రభుత్వమే 2 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించి లబ్దిదారునికి అందిస్తుందన్నారు. మార్చి నెలాఖరు నాటికి 8912 ఇళ్ళను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రూ.10 కోట్లతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అమృత పథకం క్రింద పేజ్ ఒన్, పేజ్ త్రీలలో చేపట్టిన పనులు జరుగుతున్నాయని ఇంటించికీ మంచినీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా అమ్మఒడి, జగనన్నతోడు, ఆసరా, నాడు-నేడు, రైతుభరోసా, జగనన్న విద్యాదీవెన్, వసతిదీవెన వంటి పలు పథకాలను నేరుగా లబ్దిదాగారుల అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మనమందరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిజేద్దామన్నారు.
స్థానిక నాయకులు మండలి హనుమంతరావు మాట్లాడుతూ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ముఖ్యమంత్రిని మెప్పించి గుడివాడ నియోజకవర్గ అభివృద్ది ఎక్కువ నిధులు తెస్తున్నారన్నారు. మంత్రి గారి చొరవతో నేడు మనం నూతన మంచినీటి ట్యాంక్ ను నిర్మించుకుంటున్నామన్నారు.
ఏరియా ఆసుపత్రి అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోగవర్గ అభివృద్దికి మంత్రి కొడాలి నాని విశాంత్ర లేకుండా పనిచేస్తున్నారని, అదేతరహాలో నియోజకవర్గ అభివృద్ది నిధులు సమకూర్చుతున్నారన్నారు.

సభకు అధ్యక్షత వహించిన వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను మాట్లాడుతూ అమృత పథకం క్రింద 3.5 కోట్లతో ఈ ప్రాంత ప్రజలకు మంచినీటి ట్యాంకు నిర్మాణానికి మంత్రి శ్రీ కొడాలి నాని కృషి చేసారని తెలిపారు. ముందుగా మంత్రి కొడాలి నాని దేశ మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలేటి సుబ్రహ్మణ్యం(చంటి), మాజీ కౌన్సిలర్ పొట్లూరి వెంకట కృష్ణారావు, రూరల్ మండల కన్వీనర్ మట్టాజాన్ విక్టర్, వైఎస్ఆర్ సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకట లక్ష్మి, గుడ్మెన్పేట వైసిపి ప్రముఖులు మామిళ్ల ఎలీషా, మామిళ్ల రాజేష్, కాంట్రాక్టరు సూర్య ప్రకాశరావు, మున్సిపల్ కమిషనరు సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్సుజ్యోతుల సత్యవేణి, ప్రభోధరాణి, అల్లం సూర్య ప్రభ, వెంపటి సైమన్, అల్లం రామ్మోహనరావు, దైవజనులు మందా సువర్ణబాబు, బాలసాని ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *