Breaking News

చల్లపల్లిలో లారీ ఢీ కొని డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు

చల్లపల్లి తెలుగు తేజం ప్రతినిధి :చల్లపల్లిలోని ఒక ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో బీ. ఎస్. సీ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఘంటసాల మండలం శ్రీకాకుళంకు చెందిన దేవరపల్లి అభినవ్ తన క్లాసుమేట్ మోపిదేవికి చెందిన మోపిదేవి కార్తీక్ తో కలిసి వెళుతుండగా చల్లపల్లి జడ్పీ హైస్కులు ఎదుట ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.అభినవ్ లారీ చక్రాల కింద పడి నలిగిపోయి చనిపోయాడు.స్థానికులు వెంటనే పక్కన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే విద్యార్థి అభినవ్ మృతి చెందినట్లు డాక్టర్ అరుణ కాత్యాయనీ నిర్దారించారు. ఎస్ఐ సందీప్ ఏఎస్ఐ రాజు వివరాలు నమోదు చేసుకున్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *