Breaking News

జగ్గయ్యపేట కు రైలు సౌకర్యం కల్పించండి: స్టేషన్ మాస్టర్ కి వినతి

వత్సవాయి (తెలుగు తేజం ప్రతినిధి):వత్సవాయి మండలం మక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల రైల్వేస్టేషన్ మాస్టర్ యన్.జె.డి.రాజు కి పలువురు వినతిని సమర్పించారు.సౌత్ సెంట్రల్ జోన్ కి జగ్గయ్యపేట ప్రాంతం గూడ్స్ రైల నుండి అత్యధిక ఆదాయం వస్తుంది.మెాటమర్రి నుండి జగ్గయ్యపేట మీదుగా మేళ్ళచెరువు వరకు రైల్వే ట్రాక్ పనులు పూర్తి అయిందని,ప్రస్తుతం గూడ్స్ రైలు మాత్రమే తిరుగుతుంది.విజయవాడ నుండి జగ్గయ్యపేట మీదుగా హైదరాబాద్ వరకు ప్రజలు ప్రయాణించడానికి ఈ మార్గం గుండా ప్యాసింజర్ రైలు ను వెంటనే అందుబాటులోకి తీసుకొని రావాలని,ప్రజలు,ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ప్యాసింజర్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.వెంటనే జగ్గయ్యపేట రైల్వే లైన్ ద్వారా ప్యాసింజర్ రైలుని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని రావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు,బాణావత్తు రాంబాబు,బిసి నియెాజక వర్గ అధ్యక్షులు గడ్డం రాంబాబు, బిసీ నియెాజకవర్గ కార్యదర్శి యం ఉమా,ముస్లిం సామాజిక నాయకులు షేక్ హమీద్,షేక్ పర్విన్,కరిసే మధు లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *