Breaking News

జిబిఎల్‌ ప్రింటర్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్‌ఆర్‌ వర్థంతి వేడుకలు


విజయవాడ (తెలుగుతేజం ప్రతినిధి) : వైయస్‌ఆర్‌ 13వ వర్థంతి సందర్భంగా విజయవాడ అరండల్‌పేట చింతావారి వీధిలో జిబిఎల్‌ ప్రింటర్స్‌ అధినేత కూర్మా మోజెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వైయస్‌ఆర్‌ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూర్మా మోజెస్‌ మాట్లాడుతూ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో తాను గత 13 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ రోజు (సెప్టెంబర్‌ 2) ఆయన 13వ వర్థంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగిందని పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి అహర్నిశలూ శ్రమించిన వైయస్‌ఆర్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూర్మా మోజెస్‌తో పాటు పి.సూరిబాబు, ఆర్‌.రవికుమార్‌, ఈ.రాము, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *