Breaking News

తిరుమల కొండపై ఘనంగా రథసప్తమి వేడుకలు

తెలుగు తేజం, తిరుమల : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై, చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై, 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఇక.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *