Breaking News

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

రాజమండ్రి:  తూర్పు గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా…వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదఘటన జిల్లాలోని గోకవరంలో చోటుచేసుకుంది. గోకవరం మండలం ఠాకూర్‌పాలెంనకు చెందిన యువకుడు, రాజానగరం మండలం వెలుగుబందాకు చెందిన యువతికి గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది.
వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 22 మంది వ్యానులో కొండపై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వ్యాను బ్రేకులు ఫెయిల్‌అవడంతో అదుపుతప్పి మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు కన్నుమూశారు. తీవ్రగాయాలైన వారిని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *