ఏలూరు: అంతుచిక్కని వ్యాధితో కలకలం రేగిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నేడు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) బృందం పర్యటించనుంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. నగరంలో బాధితులు అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో ఆ బృందం పర్యటించి నమూనాలు సేకరించనుంది. దీంతో పాటు కొందరు బాధితులతోనూ ప్రతినిధులు మాట్లాడనున్నారు. దీంతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్రబృందం కూడా నేడే ఏలూరులో పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నేటి సాయంత్రానికి తమ నివేదికను కేంద్రానికి పంపనుంది.