Breaking News

నేత్రపర్వంగా శ్రీ వారి కళ్యాణ మహోత్సవం

తెలుగు తేజం విజయవాడ:వన్ టౌన్ బ్రాహ్మణ వీధి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో స్వామి వారి కల్యాణోత్సవం గురువారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. స్వామి వారి సన్నిధిలో నాలుగు రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కల్యాణ వేదికపై స్వామివారి ఉత్సవమూర్తిని విశేష అలంకారం తో అధిష్టింప చేశారు. అనంతరం పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాల అనంతరం అమ్మవార్లను వేదికపైకి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం అనంతరం స్వామివారికి గజవాహన ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలను పాలకమండలి చైర్మన్ గుడిపాటి పాపారావు. కార్యనిర్వహణాధికారి గెల్లి హరి గోపీనాథ్ బాబు పర్యవేక్షించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *