Breaking News

బెజవాడలో మహిళా ఉద్యోగులపై పెట్రోల్ పోసి దాడి

బెజవాడలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నించిన మహిళా ఉద్యోగులపై పెట్రోల్ పోసి భయభ్రాంతులకు గురిచేసిన దారుణ ఘటన బెజవాడలో కలకలం రేపింది. కృష్ణలంక ఏరియాకు చెందిన వార్డు సచివాలయ ఉద్యోగినులు అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారని స్థానిక వైసీపీ నేత, 16 వ వార్డు కార్పొరేటర్ రాధిక భర్త దౌర్జన్యానికి దిగినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని అడిగినందుకు అరాచకంగా వ్యవహరించినట్లు సమాచారం. మహిళలనే కనీస గౌరవం లేకుండా వారిపై ఆక్రమణదారులతో పెట్రోల్ పోయించి భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా పెట్రోల్ పోయడంతో నలుగురు సచివాలయ ఉద్యోగినులు ప్రాణభయంతో వణికిపోయారు.. ఈ ఘటన విజయవాడలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేత ఆగడాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *