Breaking News

కట్టుబడిపాలెం గ్రామంలోబోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు

తెలుగు తేజం, జి.కొండూరు:కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన దృష్ట్యా మైలవరం సిఐ పీ.శ్రీను పర్యవేక్షణలో జి.కొండూరు ఎస్సై ఆర్.ధర్మరాజు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై తిరువూరు వైపు నుంచి బిజెపి నాయకులు కార్యకర్తలు ఆందోళనకారులు విజయవాడ వైపు వెళ్లకుండా కార్లను, వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పోలీసు పరిధిలోని కట్టుబడిపాలెం గ్రామం వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ఎటువంటి అనుమానాస్పద వాహనాలను అనుమతించటం లేదు. కాగా ఇప్పటికే మైలవరం సర్కిల్ పరిధిలోని బిజెపి నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని, హౌస్ అరెస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *