Breaking News

భార్యాభర్తలకు విద్యుత్ షాక్

కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పెదపట్నం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలకు విద్యుత్ షాక్ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెరువుల యజమాని కరెంటు తీగలను రోడ్డుకు అడ్డంగా వేయడం వలన ఉదయం కురిసిన వర్షానికి తడిసి షాక్ కొట్టినట్లుగా తెలుస్తోంది. కాగా… విషయం బయటకు పొక్కకుండా కొందరు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *