Breaking News

మండల సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వరంలో ఘనంగా వైయస్ భారతి జన్మదిన వేడుకలు

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఘనంగా వైఎస్ భారతి జన్మదిన వేడుకలు, మండల సమాఖ్య సభ్యులు, మహిళలతో కలిసి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి వైయస్ భారతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మండల సమాఖ్య కార్యాలయంలో పెద్ద ఎత్తున పాల్గొన్నా మహిళలు ,సంఘం సభ్యులతో కలిసి కేక్ కటింగ్ చేసి వైయస్ భారతమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎన్ని కష్టాలైన ఎదిరించి విజయం సాధించవచ్చని నేటి మహిళ లోకానికి చాటిచెప్పిన మహిళా నాయకురాలు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన వైయస్ భారతమ్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆమె తెలియజేశారు. గౌరవ ప్రదమైన డాక్టర్ కుటుంబంలో జన్మించి ఉమ్మడి రాష్ట్రం లో ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి కోడలు అయి ఉండి కూడా ఒక సామాన్య మహిళల గా ఆమె ఎంతో నేర్పుతో అన్ని విషయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగ వెన్నుదన్నుగా ఉంటూ ఆ కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ తానై కుటుంబాన్ని, వ్యాపారాన్ని ముందుండి నడిపించిన మహిళా నాయకురాలు అని ప్రజా సేవ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కర దిశగా చర్యలు తీసుకుంటు తనదైన శైలిలో మహిళలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు నడవాలని ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో కలిసి ప్రయాణిస్తున్నారని, ఆమె వ్యాపార రంగంలో రాజకీయరంగంలో ప్రజా సేవ చేస్తూన్న వైయస్ భారతి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య సభ్యులు,ఎపియంలు,సంఘం సభ్యులు, కార్యాలయం సిబ్బంది విఓలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్ని వైయస్ భారతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *