Breaking News

మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమలకు రాష్ట్రపతి దంపతులు

తిరుమల: నేటి మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు చేరుకోనున్నారు. రాష్ట్రపతితో పాటు తిరుమలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. కరోనా కారణంగా రాష్ట్రపతి పర్యటనలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పరిమిత సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అందరికీ కరోనా పరీక్షలు యంత్రాంగం చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *