Breaking News

మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్స్

రేపటి నుంచి పూర్తిస్థాయిలో కరోనా సేవలు

హైదరాబాద్ : కరోనా వికృతరూపానికి తెలంగాణ విలవిలలాడుతోంది. ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలుచాస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆసుపత్రులను కోవిడ్ కేంద్రాలుగా మార్చేందుకు రెఢీ అయ్యింది. ఇందులో భాగంగా గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. గాంధీ ఆసుపత్రిని మరోసారి పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారి చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నిర్ణయించారు.

ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 450 మందికి పైగా పేషంట్స్ వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది కరోనా పేషంట్లు చేరారు. కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపి వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ 17 నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *