Breaking News

మహా శివరాత్రికి పవిత్ర సంగమంలో ఏర్పాట్లు పూర్తి

తెలుగుతేజం ఇబ్రహీంపట్నం :మహా శివరాత్రి పుణ్య స్నానాలకు పవిత్ర సంగమంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగమం ఘాట్ లో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సంగమం పరిసరాలను పురపాలక అధికారులు సిబ్బందితో పరిశుభ్రం చేయించారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్ ను శుభ్రం చేయించారు. గురువారం తెల్లవారుజాము నుంచే యాత్రికులు భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. మహిళలు స్నానమాచరించిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదుల సౌకర్యం కల్పించారు. ఏర్పాట్లను కొండపల్లి పురపాలక సంఘం కమిషనర్ పి.శ్రీధర్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *