Breaking News

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా

విజయవాడ నగరంలో మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా మర్యాద పూర్వకoగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు విజయవాడ నగర వైసీపీ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లను గెలిపించడంలో కూడా విశేష కృషి చేసి మేయర్ పీఠము కైవసం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారానీ గుర్తు చేశారు. నేడు ఎన్ టీ ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీనీ బలోపేతం చేసే దిశగా వెల్లంపల్లి శ్రీనివాస్ రావు కృషి చేస్తున్నారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కో ఆప్షమ్ సభ్యులు సయ్యద్ ఆలీమ్, వైసీపీ నేత షేక్ అమితాబ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *