Breaking News

ముస్లిం ఖబరస్థాన్ (జన్నతుల్ బఖీ) కొరకు 28 లక్షలు మంజూరు :శాసనమండలి సభ్యులు ఎం.డి. రూహుల్లా

గవర్నరుపేట టైర్లమార్కెట్ సమీపంలోనిముస్లిం ఖబరస్థాన్ (జన్నతుల్ బఖీ) శాసనమండలి సభ్యులు ఎం.డి. రూహుల్లా చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామనీ కమిటీ సభ్యులు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి గతంలో ఈ సమస్యను తీసుకుని వెళ్లగా తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ముస్లిం ఖబరస్థాన్ (జన్నతుల్ బఖీ) కొరకు 28 లక్షలు మంజూరు చేయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం సమాజమంతా రుణపడి ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హఫీజుల్లా, విజయవాడ నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీo, షేక్ నాగుల్ మీరా, కమిటీ సభ్యులు, పలు మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *