Breaking News

మోపిదేవిలో 19 నుంచి షష్ఠి ఉత్సవాలు

తెలుగు తేజం, మోపిదేవి : సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాల కరపత్రాలను ఆలయ ఈవో జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌ మంగళవారం ఆవిష్కరణ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 19, 20, 21వ తేదీల్లో షష్ఠి కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి సోమరాజుపల్లి నాగరాజు శర్మ – గీత, రామిరెడ్డి – సునీత దంపతులు కపిల గోవు, కోడెదూడను సమర్పించారు. ఈవో జి.వి. డిఎన్‌.లీలాకుమార్‌కు అందజేశారు. ఆలయ అర్చకులు గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *