Breaking News

రాష్ట్రపతికి సీఎం జగన్‌ ఘన స్వాగతం

రేణిగుంట: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి, గవర్నర్‌ కలిసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి బయలు దేరి వెళ్లారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉండటంతో సీఎం జగన్‌ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటనలో గరవ్నర్‌, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *