Breaking News

వన్ టౌన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాశ్వత ఉభయానికి రూ.50,116 విరాళం

తెలుగు తేజం , విజయవాడ: వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శాశ్వత ఉభయానికి శ్రీకాకొల్లి చంద్రశేఖర్‌ రూ.50,116లు చెల్లించారు. మేరకు నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనాధ్‌బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకొల్లి చంద్రశేఖర్‌ తో ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అలాగే శాశ్వత ఉభయానికి నగదు చెల్లించిన ఉభయదాతలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలకు హజరుకావటానికి అవకాశముంటుందని తెలిపారు. ఆలయ అభివృద్దికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌ గుడిపాటి పాపారావు, ఆలయ అర్ఛకులు పొణంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *