Breaking News

విద్యార్థులకు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు వితరణ : తోట శ్యామ్ కిషోర్ నాయుడు

తెలుగు తేజం. మోపిదేవి : మండల కేంద్రం మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 151 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 కలర్ మరియు 4 బ్లాక్ అండ్ వైట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలను అవనిగడ్డ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామ్ కిషోర్ నాయుడు ఆర్థిక సహాయంతో గురువారం విద్యార్థులకు అందజేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థులకు ఫోటోలతో పాటు పలు సేవా కార్యక్రమములు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు వక్తలు ఆయన సేవా నిరతిని కొనియాడారు. అనంతరం ఆయనను దుశ్శాలువలతో. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల l హెచ్ఎం పి జయంతి. గ్రామ సర్పంచ్ నందిగం
మేరీ రాణి. పాఠశాల పి ఎం సి చైర్మన్ జి నాని బాబు. ఉపాధ్యాయులు కైలా ఉమామహేశ్వరరావు గ్రామస్తులు నందిగం అభిషేక రావు. మోటుపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *