Breaking News

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జుజ్జూరు టిడిపి మాజీ ప్రెసిడెంట్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జుజ్జూరు టిడిపి మాజీ ప్రెసిడెంట్ బాణావతి బిక్షాలు మరియు బాణావత్ బాలాజీ నాయక్ మరియు వారి అనుచరులు పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ,పార్టీలో చేరిన వారికి అరుణ్ కుమార్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ,ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్నారు.నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పంచాయతీలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని ,మెజారిటీ గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నామని ,టిడిపి పార్టీకి నామినేషన్ వేయడానికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఎమ్మెల్యేగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు చేసిన అభివృద్ధి ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గీటురాయిగా ఎన్నికలలో విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *