Breaking News

వై ఎస్ ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డా”మొండితోక జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, నందిగామ : నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి YSR మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు శుక్రవారం శాసనసభ్యులు డా”మొండితోక జగన్ మోహన్ రావు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ,ఉత్తేజాన్ని కలిగిస్తాయని ,క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీతత్వంతో ,క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యంతో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ,దాదాపు 15 రోజుల పాటు జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 80 జట్లు పాల్గొనగా మొదటి బహుమతిగా రూ.20116 /-,రెండో బహుమతి రూ.15113 /- ,మూడవ బహుమతి రూ.10116/- లుగా శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆయన సొంత డబ్బును అందజేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెమంటోలను అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *