Breaking News

సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాధ్‌ దాస్‌

తెలుగు తేజం, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా ఉన్నారు. కాగా రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌ గుప్తా బెజవాడకు చిరపరిచితుడు. బీహార్‌ రాష్ట్రంలోని మధుబని జిల్లాకు చెందిన ఆయనకు విజయవాడతో అనుబంధం ఎక్కువే. ఆయనకు ఐఏఎస్‌ అధికారిగా మొదటి పోస్టింగ్‌ విజయవాడలోనే. 1987 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి విశాఖలో ట్రైనీ కలెక్టర్‌గా చేశారు. అనంతరం విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 1989 నుంచి 91 వరకు రెండున్నరేళ్లపాటు ఆయన ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం నెల్లూరు జేసీగా, అక్కడి నుంచి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా వెళ్లారు. తిరిగి 1995లో జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చారు. విజయవాడలో ఉన్నపుడే 1990వ సంవత్సరం మార్చి1వ తేదీన ఆయన వివాహం జరిగింది. ఆయన ఓడీఏ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో విజయవాడకు భారీగా నిధులు ఇప్పించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *