Breaking News

25 వ డివిజన్‌లో ఘనంగా వైయస్‌ఆర్‌ వర్థంతి వేడుకలు

విజయవాడ (తెలుగుతేజం ప్రతినిధి) : విజయవాడ 25వ డివిజన్‌లో డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి 13వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజారంజక పాలన ఆదర్శంతో డివిజన్‌లోని ప్రజలతో మమేకమవుతూ ఈ వేడుకలు జరిగాయి. 25వ డివిజన్‌ వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు బంకా భాస్కర్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫోటోకు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని సమస్యల పట్ల పరిష్కరించటానికి తాను అహర్నిశలూ కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్‌ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *