Breaking News

ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలుగు తేజం, అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *