Breaking News

తండ్రైన తేజస్వీ యాదవ్‌

 ఆర్జేడీ (RJD) అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఇంట సందడి వాతావరణం నెలకొంది. లాలూ కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి . తేజస్వీ యాదవ్‌. తొలిసారి తండ్రయ్యారు..

దేవుడు సంతోషించి, కూతురి రూపంలో బహుమతి పంపాడు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. తొలిసారి తల్లిదండ్రులైన తేజస్వీ దంపతులకు ఆర్జేడీ నేతలతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, తేజస్వీ యాదవ్.. చిన్న నాటి స్నేహితురాలైన రాజశ్రీని 2021 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. రాజశ్రీ హర్యానాలోని రేవారీకి చెందినవారు. కాగా.. ఆమె చిన్నతనం నుంచి ఢిల్లీలోనే నివసించేవారు. తేజస్వీయాదవ్, రాజశ్రీ ఢిల్లీలోని ఆర్ కె పురంలోని డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *