Breaking News

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కె.డి.సి.సి బ్యాంకు ఆర్థిక భరోసా

తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ( కె.డి.సి.సి ) ఆర్ధిక సహాయం అందజేయడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం విజయవాడలోని కేంద్ర సహకార బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గౌరవరం గ్రామానికి చెందిన నెలకుర్తి మార్తమ్మ, ముండ్లపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి రమాదేవి, పోచంపల్లి గ్రామానికి చెందిన పాతూరి వేణురెడ్డి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్ గారు, పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి గారు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు కేడీసీసీ బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *