Breaking News

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. గత నెల రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజులో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌ అవుతున్నారు. గత 24 గంటలుగా ఏపీలో 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. గత 24 గంటల్లో 5,504 మంది కరోనాను జయించారు.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ 6,256 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,08,712 ఇప్పటివరకూ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 66.30 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురంలో ఇదివరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లో కరోనా ఉధృతి చాలా వరకూ తగ్గింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *