Breaking News

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి

సూరత్‌: రాతి పనిచేసుకొని బతికే ఆ కూలీల బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం పాదచారుల బాటనే నివాసంగా చేసుకున్న వారి జీవితాలకు అదే చివరి మజిలీ అయింది. రాళ్లుకొట్టి అలసిన వారు.. ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలకు తీరని శోకం మిగిల్చి వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా కోసంబి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూరత్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరంతా రాజస్థాన్‌లోని బాన్స్‌వాడా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం-మంగళవారం మధ్య రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కోసంబిలోని ఓ ప్రధాన కూడలి నుంచి మాండ్వివైపు లారీ వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో ఎదురుగా చెరకు లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్‌వైపు మళ్లించాడు. దీంతో అక్కడే నిద్రిస్తున్న 18 మంది కార్మికులపై నుంచి లారీ దూసుకెళ్లింది. వీరిలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ముగ్గురికి వైద్యసాయం కొనసాగుతోంది. ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడగా.. ఆమె తల్లిదండ్రులు మృతిచెందడం విషాదకరం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *