Breaking News

చందర్లపాడులో ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పాదయాత్ర

తెలుగు తేజం, చందర్లపాడు : వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర అభివృద్ధికి పడిన ముందడుగని ఎమ్మెల్యే డా. మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. చందర్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ప్రజలతో నాడు -ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు 14 నెలల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చిందన్నారు ,అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వై.యస్.జగన్మోహన రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని త్వరలోనే నియోజకవర్గం ముఖచిత్రం మార్చే విధంగా పని చేస్తామన్నారు. చందర్లపాడు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *