Breaking News

జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

పశ్చిమబంగాల్‌ : పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా రహదారిని నిర్బంధించిన ఆందోళనకారులు నడ్డా కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు భాజపా బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దిలీప్ ఘోష్‌ లేఖ రాశారు. ‘నడ్డా పర్యటనలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయి. బుధవారం ఆయన కార్యక్రమాల్లో ఎక్కడా పోలీసులు లేరు. ఈ రోజు కూడా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సరికదా.. నడ్డా వాహనానికి అత్యంత సమీపంలోకి వచ్చే వరకు వేచి చూశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని దిలీప్‌ ఘోష్‌ లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా నిన్న కోల్‌కతా వెళ్లారు. గురువారం డైమండ్‌ హార్బర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి భాజపా తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో నడ్డా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *