Breaking News

ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ

తెలుగు తేజం, కంచికచర్ల : జిల్లా ఎస్పీ పి రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నందిగామ రూరల్ సీఐ కె సతీష్ స్థానిక ఎస్ఐ రంగనాథ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై శుక్రవారం రాత్రి కంచికచర్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక చెవిటికల్లు రోడ్డు సెంటర్ నుండి పోలీస్ సిబ్బంది గ్రామ మహిళ పోలీసులతో కలిసి జాతీయ రహదారిపై నెహ్రూ సెంటర్ జుజ్జూరు రోడ్డు గొట్టుముక్కల రోడ్డు లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ రూరల్ సిఐ కే సతీష్ మాట్లాడారు.ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు .ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి అన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు.వాహనదారులు లైసెన్సు కలిగి ఉండాలని వాహనం యొక్క రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు లేనిచో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా లైసెన్సు లేకుండా రికార్డు లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్ సిబ్బంది డేవిడ్ గిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *