Breaking News

నిషేదిత గుట్కా, గంజాయి రవాణాను అడ్డుకున్న కంచికచర్ల పోలీసులు

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల పట్టణంలో చెవిటికల్లు బైపాస్ రహదారి సమీపంలో ప్రతి పొలాల వద్ద ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్ లతో పట్టుబడిన వ్యక్తులపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన నందిగామ రూరల్ సీఐ సతీష్ మాట్లాడుతూ తొండెపు కమలాకర్, వంకదారి వెంకటేశ్వరరావు అని ఇద్దరు వ్యక్తులు AP16FD5849 నంబర్ గల ద్విచక్రవాహనం తో ప్రభుత్వం నిషేధించిన ఖైదీ మరియు గుట్కా మూటలతో పత్తి పొలం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుంది గుట్కాలు మాత్రమే కాకుండా వీరి వద్ద కేజీ పావు గంజాయి సైతం లభించిందని పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *