Breaking News

నేటినుంచి నుంచి రాత్రి కర్ఫ్యూఏపీలో వీటికే అనుమతి

తెలుగు తేజం, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • కొవిడ్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ.
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది.
  • అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు , రెస్టారంట్లు, హోటళ్లు మూసివేయాలి.
  • ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి.
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
  • నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు
  • నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు
  • వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి
  • అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు.
  • ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూతో పాటు నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *