Breaking News

నేటి బాలలే రేపటి పౌరులు : సెర్ఫ్ సీఈవో ఇంతియాజ్

విజయవాడ : పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడే నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుగుతుందని రాష్ట్ర సమగ్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముఖ్య కార్య నిర్వహణధికారి ఎ.ఎమ్.డి.ఇంతియాజ్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని సెర్ఫ్ కాన్ఫరెన్స్ హాల్ నందు జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్బంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని “చాచా నెహ్రూ చెకుముకి అవార్డు” ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీకి అభిమాన నాయకులైన నెహ్రూ స్వతంత్ర భారత ప్రధానిగా 1947 ఆగష్టు 5న భాద్యతలు చేపట్టారని వివరించారు. అనంతరం విద్యార్థులకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం, ఎస్.ఆర్.ఆర్.చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎస్.రామచంద్ర రావు, డి.ఎస్పీ.ఎన్.బి.ఎమ్.మురళీకృష్ణ, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *