Breaking News

విజయవాడలో భారీ కొండచిలువ కలకలం

విజయవాడ : విజయవాడలో భారీ కొండ చిలువ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. వివరాలులోకెళ్తే వచ్చే నాగులు చవితి ని పురస్కరించుకుని కాలువ వెంబడి ఉన్న పుట్టలపై ఉన్న పిచ్చి మొక్కలను కూలీలు తొలగిస్తున్నారు. ఇదే తరుణంలో ఓ పెద్ద పాము కనపడిందని పనిచేస్తున్న వ్యక్తి కేకలు వేయడంతో దీంతో అక్కడ వెళ్లి అందరూ చూడగా ఓ పెద్ద భారీ పైతన్ కదులుతూ ఉండటం గమనించారు.. దీంతో ఇరిగేషన్ ఏఈ ఈ అంజుమన్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడ చేరుకుని వారి కొండచిలువ ను కష్టపడి పట్టుకున్నారు. ఒకటే ఉందా… ఈ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్నాయని ఆలోచనతో ఉన్నారు. కాల్వ గట్టుపై ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఏఈ కోరారు. ఇంత భారీ కొండచిలువ ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీసుతున్నారు. కాల్వలోని నీటి ప్రవాహానికి వచ్చి ఉంటుందని అంచనా…?

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *