Breaking News

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్సార్ – శీలం రంగారావు

తెలుగు తేజం, గన్నవరం:
కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం లో వైఎస్సార్సీపీ పార్టీ గ్రామ కన్వీనర్ పరిమి వంశీ అధ్వర్యంలో వైఎస్సా. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందు గా స్థానిక రామానగర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం రంగారావు పాల్గొని మాట్లాడారు. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు అని అన్నారు.

దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్ పయనిస్తున్నారన్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్‌ వంద అడుగులు ముందుకు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరిమి రమేష్, పి. ఏ. సి. యస్ చైర్మన్ బొప్పన కృష్ణ, వార్డ్ మెంబర్లు, స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *