Breaking News

రాజారావు మృతి పట్ల లోకేష్ దిగ్భ్రాంతి


అమరావతి: చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ కర్రా రాజారావు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచిన కర్రా రాజారావు మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజారావు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *