Breaking News

లక్కీ డ్రా అంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దు : దుర్గ గుడి ఈవో సురేష్ బాబు

తెలుగు తేజం, విజయవాడ : భక్తులు సమర్పించిన పట్టుచీరలను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నావచ్చే ఫోన్ కాల్స్ ను భక్తులు ఎవరూ నమ్మవద్దని దుర్గ గుడి ఈవో సురేష్ బాబు తెలిపారు. కొంతమంది మోసగాళ్ళు రూ ౩౦౦౦/- విలువచేసే పట్టు చీరలు లక్కీ డ్రా లో మీ పేరు రావడంతో అందిస్తున్నామని భక్తులకు ఫోన్ కాల్ చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అమ్మవారి వస్త్ర ప్రసాదాన్ని దేవస్థానం కౌంటర్లల్లో మాత్రమే భక్తులకు విక్రయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు అటువంటి ఫోన్లు వస్తే వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈవో సురేష్ బాబు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *