Breaking News

విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం: మంత్రి ఆదిమూలపు సురేశ్‌

తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీఎం సూచనల మేరకు విద్యార్థుల భవిష్యత్తు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *