Breaking News

వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవోపేతంగా కార్తీక పౌర్ణమి

తెలుగు తేజం విజయవాడ : వన్ టౌన్ బ్రాహ్మణా వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా సహస్ర దీపాలంకరణ మరియు జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా విచ్చేసిన కొనగళ్ల విద్యాధర రావు మాట్లాడుతూ పరమ పవిత్రమైన సన్నిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పౌర్ణమి సందర్బంగా మహిళలు అధిక సంఖ్య లో పాల్గొన్నపటికీ పూజ కార్యక్రమాలు నిర్వ హించుకోవడానికి చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఈ సౌకర్యం కల్పించిన దేవస్థాన సిబందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొండపల్లి మురళీకృష్ణ (బుజ్జి), ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుడిపాటి పాపా రావు , సభ్యులు జి. సురేష్, పి. ఫణి, పి.రాయుడు, వరలక్ష్మి,భారతి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *