Breaking News

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి ఏకాదశి ఆహ్వాన పత్రికను విడుదల చేసిన : మంత్రి వెలంపల్లి

తెలుగు తేజం, విజయవాడ : బ్రాహ్మణవీధిలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం పురస్కరించుకొని ఆహ్వాన పత్రికను దేవేదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారంనుండి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం చేకూరుతుందని అన్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి గెల్లి హరిగోపినాధ్ బాబు మరియు ఆలయ చైర్మన్ గుడిపాటి పాపారావు సంయుక్తంగా మంత్రి వెల్లంపల్లిని వైకుంఠ ఏకాదశి శుభ సందర్బంగా స్వామి వారి దర్శనానికి రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందచేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి గెల్లి హరిగోపినాధ్ బాబు మరియు ఆలయ చైర్మన్ గుడిపాటి పాపారావు సభ్యులు జి. సురేష్, పి. ఫణి, పి. రాయుడు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *