Breaking News

సచివాలయం ముందు వైసిపి నేత మాగంటి అబ్బాయి ధర్నా

తెలుగు తేజం, కంచికచర్ల : జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ ఇంటి స్థలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మాగంటి అబ్బాయి సూచించాడు. ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికి కేటాయించాలని అధికారులు ఇద్దరికి ఎందుకు కేటాయించాలని మాగంటి డిమాండ్ చేశాడు .పరిటాల గ్రామంలో ఇల్లు ఉన్న వాళ్లకి ఇంటి స్థలం కేటాయించారు లేని వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఇంటి స్థలం కేటాయించలేదు .పరిటాల గ్రామంలో ఇంకా 90 మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు వారికి తక్షణమేఇంటి స్థలం కేటాయించాలని కంచికచర్ల మండలం పరిటాల సచివాలయం ముందు లబ్ధిదారులు తో కలిసి అబ్బాయి ధర్నా నిర్వహించారు . దీనికి స్పందించిన అధికారులు ఇంటి స్థలం లేని వారికి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో మాగంటి అబ్బాయి ధర్నా విరమించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *